ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
- PRASANNA ANDHRA

- May 28, 2022
- 1 min read
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూడా కూలింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.








Comments