top of page

విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • Writer: EDITOR
    EDITOR
  • May 11, 2023
  • 1 min read

విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్న విద్యార్థులు
ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


స్థానిక గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయాధికారి జె.రామనాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించబడుతున్న గ్రంథాలయ వేసవి శిక్షణ శిబిరానికి విశేష స్పందన ఉన్నదని, జూన్ 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని.. గ్రంథాలయంలో పుస్తక పఠనం, నిష్ణాతులతో కథలు చెప్పడం, చదివించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ree

పిల్లల మేధోశక్తిని పెంపొందించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని గ్రంధాలయానికి పంపవలసినదిగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రంథాలయంలో పిల్లలకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు గ్రంథాలయానికి పంపించాలని కోరారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page