top of page

అనాధ పిల్లలకు ఆర్థిక సాయం

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 26, 2023
  • 1 min read

అనాధ పిల్లలకు ఆర్థిక సాయం

సరుకులు అందజేస్తున్న ఎమ్మార్పియస్ నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


కువైట్ ఎమ్మార్పీఎస్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ సంఘం నాయకులు మంద నరసింహులు, వెలగచర్ల వెంకటేష్, గుండ్లు రమణయ్య, మందా శివకుమార్ వారి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏర్పాటయి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు చదువుకుంటున్న నిరుపేద అనాధ పిల్లలకు రూ 20 వేలు పంపగా స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు వెలకచర్ల శివయ్య, మంద శివయ్య, చేమూరు వెంకటేష్, మంద రవి, గుంటు సురేష్ చేతుల మీదుగా ఆదివారం రూ 20 వేలు విలువచేసే నిత్యవసర సరుకులు కొర్లగుంట అనాధ ఆశ్రమానికి, రాజంపేట పట్టణంలోని పూర్ చిల్డ్రన్స్ హోమ్ కు అందజేశారు.

ree

అనంతరం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ వెలకచర్ల శివయ్య మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కువైట్ వారి సేవలను కొనియాడారు. గతంలో కూడా వీరు చేసిన సేవలు చాలా గొప్పవని., అకస్మాత్తుగా మరణించిన నిరుపేద కుటుంబాలకు వారి శక్తి మేర అనేక కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారని అన్నారు. ఇటీవల కువైట్ లో అనారోగ్యంతో మరణించిన చింతరాజుపల్లికి చెందిన సైనాల జ్యోతి అనే మహిళ మృతదేహాన్ని భారత్ కు పంపించడంలో వారి సేవలు మరువలేనివని అన్నారు. ముందు ముందు మరెన్నో సేవలు చేసి అందరి మన్ననలు పొందాలని ఆశా భావం వ్యక్తం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page