top of page

తుఫాను బాధిత ఎన్.ఆర్ పురం గ్రామ పనులను పరిశీలించిన కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 13, 2022
  • 1 min read

జావెద్ తుఫాన్ కారణంగా పూర్తిస్థాయిలో నష్ట పోయి, తిరిగి మరమ్మతులు చేపట్టిన వైఎస్ఆర్ కడప జిల్లా పెనగలూరు మండలం ఎన్.ఆర్ పురం కట్టుకొమ్మ నిర్మాణ నూతన ప్రతిపాదనలు, హైస్కూల్ ప్రహరీ, పల్లంపాడు నూతన రోడ్డు మార్గాలను మరియు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఈరోజు సాయంత్రం ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తెట్టు లో వెళ్లి పరిశీలించారు.

ముంపు గ్రామాల బాధితుల అందరికీ పక్కా ఇళ్ల కోసం జగన్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ప్రకటించిందని.. త్వరితగతిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కొరముట్ల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొండూరు విజయ రెడ్డి, జడ్పిటిసి సుబ్బరాయుడు, మండల కన్వీనర్ చక్రపాణి, రంగారెడ్డి, శివ, మహేష్, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page