top of page

కేసీఆర్‌కు ఊహించని షాక్.. మరింత దూకుడుగా గవర్నర్

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 2, 2022
  • 1 min read

కేసీఆర్‌కు ఊహించని షాక్.. మరింత దూకుడుగా గవర్నర్

ree

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య ఉన్న వార్ పీక్‌కు చేరబోతోందా? తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆమె మరింత దూకుడు పెంచబోతున్నారని తెలుస్తోంది. జులై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు రోజుల పాటు రాజ్ భవన్‌లోనే బస చేయబోతున్నారట. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై ఢిల్లీకి వెళ్లి నివేదికలు సమర్పించిన గవర్నర్ మోడీ పర్యటన నేపథ్యంలో భవిష్యత్‌లో మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.రాజ్ భవన్‌లో బస చేయనున్న మోడీ? ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయం సాగుతోంది. గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page