top of page

అంతర్జాతీయ కరాటే విజేతలకు ప్రశంశలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 16, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, ఈనెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 3500 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 150 మంది వెల్లగా, వారిలో విశాఖ జిల్లా నుంచి ఐదుగురు పాల్గొన్నారు అందులో నలుగురు గోల్డ్ మెడల్ సాధించారు గెలుపొందిన క్రీడాకారులకు కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింగరావు చేతుల మీదుగా సర్టిఫికెట్స్ మెడల్స్ అందజేసి అభినందించారు కుమిటీలో బంగారు పతకం సాధించిన వారు ఎమ్.కృష్ణ చైతన్య, బి రితిక్ చంద్ర, వి ఆర్ సత్యసాయి, పి కిషోర్ వీరికి టీ మేనేజర్ గా సీనియర్ కోచ్ ఎల్ బెన్నీ కుమార్ వ్యవహరించారు, కార్యక్రమంలో కొత్త గాజువాక మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page