top of page

కాపు రిజర్వేషన్లపై కౌంటర్‌ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 28, 2023
  • 1 min read

కాపు రిజర్వేషన్లపై కౌంటర్‌ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.


కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ree

ఇదే అంశంపై దాఖలైన అన్నీ పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో.. కాపులకు 5% రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 10శాతం రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు..

ree

కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం.. ఇపుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది సందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page