top of page

60 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తాం : కేఏ పాల్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 26, 2022
  • 1 min read

రూ.60 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తాం: కేఏ పాల్


ఆంధ్రప్రదేశ్‌ ను రూ. 60వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

ree

మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 'కేఏ పాల్ రావాలి.. పాల్‌తోనే పాలన మారాలి.. ఇదే మా నినాదం' అని అన్నారు. ఇక తన పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.

ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం అవసరమన్నారు. డబ్బులు ఎలా తేవాలి, ఎలా ఖర్చు చేయాలో తెలుసునని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంద వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. జగన్‌ కు హామీలు అమలు చేయాలని ఉన్నా డబ్బు లేదని, ఆయనను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరతానన్నారు. 2024 ఎన్నికలలో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలకు పోటి చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి తాను ఓడిపోవడం జరగదని, గెలుపు ఖాయమని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page