top of page

సీనియర్ పాత్రికేయులు దుర్గారావుకి నివాళులు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 2, 2022
  • 1 min read

సీనియర్ పాత్రికేయులు దుర్గారావుకి నివాళులు

కోవొత్తుల ర్యాలీ

ree

వివిధ పత్రికలు, చానల్స్ లో పనిచేసి జర్నలిజం రంగంలో వివిధ సేవలందించిన సీనియర్ జర్నలిస్టు , వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యదర్శి, జేశాప్ వ్యవస్థాపక అధ్యక్షులు సోడిశెట్టి దుర్గారావు విశాఖలోని ఏ.ఎన్ బీచ్ ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. ఇందుకు పులివెందుల ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా కుటుంబ సభ్యులు పట్టణం లోని పాత బస్టాండ్ నుంచి పులంగల సర్కిల్ వరకు కోవోత్తుల ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు .అనంతరం ఆయన గురించి వక్తలు ప్రసంగించారు.ఈయన గత కొద్ది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో దఫా దఫాలుగా చికిత్స పొందుతున్నారు. దుర్గారావు ఆంధ్రజ్యోతి , వార్త , లీడర్ , ఆంధ్రప్రభ, విజన్ దినపత్రికలలో క్రైం రిపోర్టర్ , బ్యూరో చీఫ్ గా పని చేశారు . ఎక్సెల్ మీడియా లోకల్ ఛానల్ లోనూ చేశారు . 2012 నుంచీ సిరా పత్రిక స్థాపించి ఆ పత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు.ఈయన మృతి పట్ల పలువురు పాత్రికేయ సంఘాలు దిగ్భ్రాంతిని వ్యక్తపరిచాయి . అందరితోనూ మంచిగా ఉంటూ ఉత్తమ వ్యక్తిత్వం గల దుర్గా రావు అని కొనియాడారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page