top of page

రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యం - జనసేన నాయకులు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 2, 2023
  • 1 min read

రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యం - జనసేన నాయకులు

ree
కరపత్రాలు పంచుతున్న జనసేన నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రానున్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యమని, గ్రామ గ్రామాన జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా 57వ రోజు గురువారం రాజంపేట మండలంలోని కూచివారిపల్లె పంచాయతీ లోని పలు గ్రామాలలో జనసేన నాయకులు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు, హామీలతో కూడుకున్న కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page