top of page

జోరుగా కొనసాగుతున్న 84వ రోజు పవన్ అన్న ప్రజాబాట

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 15, 2023
  • 1 min read

జోరుగా కొనసాగుతున్న 84వ రోజు

పవన్ అన్న ప్రజాబాట

కరపత్రాలు అందజేస్తున్న జనసేన నాయకులు
ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాజంపేటలో పవనన్న ప్రజా బాట 84వ రోజు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో శనివారం ప్రజా బాట్ట కార్యక్రమంలో భాగంగా మందపల్లి పంచాయితీ, పులుపుతూరు పంచాయతీ లోని పలు గ్రామాలలో పర్యటించారు.

ree

ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవన్ అన్న ప్రజా బాట ముందుకు తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశారని, డ్యాం తెగిపోయినా నేటి వరకు ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క రూపాయి కూడా తమకు దక్కలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదం వ్యక్తం చేశారని తెలిపారు. రాబోవు 2024 ఎన్నికలలో ఓట్ల రూపంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే సంకల్పంతో ప్రజలు ఉన్నారని తెలియజేశారు.

ree

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, కొత్తూరు వీరయ్య చారి, హేమంత్, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page