top of page

కాపు నేస్తంతో కాపులకు న్యాయం జరిగేనా..??పగడాల శివ శంకర్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 30, 2022
  • 1 min read

కాపులకు ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.

పగడాల శివశంకర్ డిమాండ్.


ree

నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం ద్వారా కాపు మహిళల్లో ఆర్థిక పురోగతికి బాటలు వేసామని పేర్కొన్న మాటలు పచ్చి అబద్ధాలు అని పేర్కొంటూ..ఈ రోజున చిట్వేల్ టౌన్ చిరంజీవి యువత అధ్యక్షులు పగడాల శివ శంకర్ స్పందిస్తూ ...కాపులను ప్రతిసారీ అవమానిస్తూ కాపు సామాజిక వర్గ నేతలతోనే బూతులు మాట్లాడిస్తున్న ఈ ముఖ్యమంత్రి తీరును కాపు సోదరులు గమనిస్తున్నారని బటన్ నొక్కితే అద్భుతాలు జరిగిపోతాయని భావిస్తున్న ఈ ముఖ్యమంత్రి కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసి ఈబీసీ కోటాలో కాపులకి ఉన్న రిజర్వేషన్ తొలగించి కాపు జాతికి తీవ్రద్రోహం చేశారనీ ఇపుడు కాపులకు ఏదో అద్భుతాలు చేశామని చెబితే, ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలనీ అన్నారు.


కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కాకి లెక్కలను పక్కన పెట్టి, గత మూడేళ్లలో కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని చిట్వేల్ టౌన్ చిరంజీవి యువత అధ్యక్షులు పగడాల శివ శంకర్ డిమాండ్ చేసారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page