top of page

జగనన్న సురక్షతో పేదల ఆరోగ్యానికి రక్ష.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 5, 2023
  • 1 min read

---- మార్గోపల్లి సురక్ష కార్యక్రమం లో

సచివాలయ కన్వీనర్

ఆనాల సుబ్రహ్మణ్యం రెడ్డి.

ree

అందరి ఆరోగ్యమే మహా భాగ్యం అన్న తలపుతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదల ఆరోగ్యానికి భరోసా అని మార్గోపల్లి సచివాలయ కన్వీనర్ ఆనాల సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు.

స్థానిక సర్పంచ్ ఆనాల ఈశ్వరమ్మ అధ్యక్షతన మండల ఏవో మోహన ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున పంచాయతీ పరిధిలోని ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలతో పాటు వైద్యుల సలహాలను మందులను పొందారు. ప్రజల ఇంటి వద్దకే రావడం ప్రజలందరికీ అనారోగ్య సమస్యలను గుర్తించడం వైద్య పరీక్షలు నిర్వహించడం గత ప్రభుత్వాలలో లేదని ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సచివాలయ కన్వీనర్ సుబ్రహ్మణ్య రెడ్డి అన్నారు.

ree

ఈ కార్యక్రమంలో వైద్యులు అన్సారి,రెవిన్యూ ఇన్స్పెక్టర్ శేషం రాజు ,గ్రామ విఆర్ఓ ఉదయ్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ వినోల రాణి, మెడికల్ ఆఫీసర్ కృష్ణయ్య , వైద్య సిబ్బంది,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page