top of page

పేదల ఆపన్న హస్తం జగనన్న భీమా

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 27, 2023
  • 1 min read

పేదల ఆపన్న హస్తం జగనన్న భీమా

ree
బాధితులకు జగనన్న భీమా అందిస్తున్న సర్పంచ్

పేదల పాలిట ఆపన్న హస్తం జగనన్న భీమా అని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. ఇటీవల తోటపాలెంకు చెందిన సయ్యద్ లహత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల జగనన్న బీమా మంజూరు అయింది. ఇందులో భాగంగా సోమవారం పదివేల రూపాయలు నగదును మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని సర్పంచ్ జంబు సూర్యనారాయణ మండల పరిషత్ కార్యాలయ ఏ ఓ ప్రకాష్ లు పేర్కొన్నారు. సయ్యద్ లాహత్ మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబానికి అండగా జగనన్న భీమా లభించడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ అధికారిని లక్ష్మిశరణ్య పంచాయతీ సిబ్బంది నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page