top of page

జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు రక్ష - ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 5, 2023
  • 1 min read

జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు రక్ష - ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి.

ree
కంటి పరీక్షల పరిశీలిస్తున్న ఎంపీపీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు ఒక వరం లాంటిది అని మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి అన్నారు. నందలూరు మండలం నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ లోని సచివాలయం 3లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశం లోనీ ఎక్కడ ఎ రాష్ట్రం కూడా అమలు చేయని పథకాలు మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్రం లో అమలు చేస్తున్నారు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉండాలనే ఉద్దేశ్యం తో ఈ పథకం అమలు లోనికి తీసుకునీ రావడం జరిగింది అన్నారు. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన కంటి పరీక్షల కేంద్రం ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్య నారాయణ, జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి అమీర్, మండల కో ఆప్షన్ సభ్యులు కల్లిమ్, ఎంపిడిఓ సౌభాగ్యం, డాక్టర్ సృజన, చంద్ర శేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్ లు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page