top of page

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఆరోగ్యం

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 30, 2023
  • 1 min read

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందరికీ ఆరోగ్యం

ree
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

నందలూరు మండలం పాటూరు గ్రామం పంచాయతీ లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నకు రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల బాగోగులను గురించి ఆలోచించే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాలంటరీ, ఆరోగ్య సిబ్బంది తో ప్రతి ఇంటిలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నీ సర్వేలు చేయించి అనారోగ్య వ్యక్తులను క్లుప్తంగా పరిశీలించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైద్యం అందేల ఒక మంచి కార్యక్రమాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఏర్పాటు చేశారని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.

ree
హాస్పిటల్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి, పాటూరు సర్పంచ్, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నాయకులు, వైద్యాధికారులు సృజన, చంద్ర శేఖర్ రెడ్డి, వాలంటీర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page