top of page

నిరుపేద కుటుంబాలకు చేయూత

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 23, 2023
  • 1 min read

నిరుపేద కుటుంబాలకు చేయూత

ree

చాపాడు మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో ఐదు నిరుపేద కుటుంబాలకు ఆదివారం ఈ ఆర్ కె ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ. 5వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఇర్గం రెడ్డి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఐదు నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆర్థిక సహాయం చేశామన్నారు. మండల పరిధిలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. తమ కష్టాలను గుర్తించి అడగకుండానే ఆర్థిక సహాయం చేసిన కార్తీక్ రెడ్డిని బాధితులు అభినందించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page