top of page

గురుకుల పాఠశాలలో సొసైటీ జాయింట్ సెక్రటరీ తనిఖీలు

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 7, 2023
  • 1 min read

గురుకుల పాఠశాలలో సొసైటీ జాయింట్ సెక్రటరీ తనిఖీలు

సిబ్బందితో మాట్లాడుతున్న సొసైటీ జాయింట్ సెక్రటరీ శివరాం.
సిబ్బందితో మాట్లాడుతున్న సొసైటీ జాయింట్ సెక్రటరీ శివరాం

నందలూరు మండలం లోని ఆడపూరు లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సొసైటీ జాయింట్ సెక్రెటరీ శివరాం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి ఇంటర్మీడియట్ చదువుతున్న రెడ్డమ్మ అనే విద్యార్థిని పాఠశాల భవంతి పైనుంచి పడి కడప ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమెను పరామర్శించేందుకు విజయవాడ నుంచి రావడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే పాఠశాలలో గల వసతులు విద్యార్థులకు ఎలా అందుతున్నాయో అన్నదాని పైన ఈ పాఠశాల కు రావడం జరిగిందని అన్నారు. కిందపడిన విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం మాట్లాడుతూ ఉందని ఆమె తల్లిదండ్రులను కోల్పోయిన సమస్యల వల్ల మనోవేదనకు గురి ఇలా జరిగిందని ఆయన తెలిపారు. ఆయనతోపాటు మండల ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీడీవో సౌభాగ్యం, జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్ , రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ , సిబ్బంది పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page