top of page

ప్రభుత్వ ఉద్యోగి చేతివాటం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 7, 2023
  • 1 min read

ప్రభుత్వ గోడౌన్ లో ఉద్యోగి చేతివాటం

రూ.4.50 లక్షల విలువైన సామగ్రి చోరీ..

ree

కడప తాలూకా ఠాణా పరిధిలోని ఓ ప్రభుత్వ గోదాంలో పని చేస్తున్న ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శించి రూ.4.50లక్షలు విలువ చేసే సిమెంటు, ఇనుప కడ్డీలను దొంగలించినట్లు సీఐ ఉలసయ్య తెలిపారు. చెమ్ముమియాపేట లోని ప్రభుత్వ గోదాంలో కార్తీక్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇటీవల ఎవరికీ తెలియకుండా 800 బస్తాల సిమెంటు, 1330కిలోల ఇనుప కడ్డీలను దొంగలించాడు. గృహ నిర్మాణశాఖ డీఈ హనుమంతప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page