top of page

పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు - గోసా మనోహర్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 25, 2022
  • 1 min read

కొత్తపల్లె పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్ - వైసీపీ దళిత నాయకులు గోసా మనోహర్

ree

కొత్తపల్లె పంచాయతీ నిధులు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ దళిత నాయకులు గోసా మనోహర్ ఆరోపించారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్తపల్లె పంచాయతీ సర్పంచి పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్ధికి కాకుండా స్వప్రయోజనానికి వినియోగిస్తున్నారన్నారు. కొత్తపల్లె పంచాయతీ పరిధిలో కొత్తగా ప్రజలు ఇళ్ళు నిర్మించాలన్న ప్రత్యేక టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కేవలం స్వప్రయోజనాల కోసమే సర్పంచ్ గా గెలుపొందారని, ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ద్వారా ఎన్నికలలో గెలిచి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, బాబు, రాజేష్, మధు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page