top of page

మండలంలో పలు చోట్ల ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 2, 2023
  • 1 min read

మండలంలో పలు చోట్ల ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - నివాళి అర్పించిన ఎస్ ఐ అబ్దుల్ జహీర్

గాంధీ చిత్ర పటానికి నివాళి అర్పించిన ఎస్ ఐ

జాతిపిత మహాత్మా గాంధీజీ జన్మదిన వేడుకలు మండలములోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో సిబ్బంది తో కలసి ఎస్ ఐ అబ్దుల్ జహీర్ గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచాయితీ సర్కిల్లో అన్నమయ్య జిల్లా వక్స్ బోర్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమిర్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు యంబలూరు నరసింహస్వామి ఆధ్వర్యంలోమహాత్మా గాంధీజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

పంచాయతీ సర్కిల్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమం

ఈ సందర్భంగ సయ్యద్ అమీర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం సిద్ధించడంలో శాంతి యుతంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని నేటి యువత గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర బిసి నాయకులు హిమగిరినాథ్ యాదవ్, హెచ్. నాగరాజారావు, వేపగుంట సామ్రాస్, కమల్ భాష, అజమత్ అలీ, గురు ప్రసాద్, కె. గంగిరెడ్డి, కె. శ్రీనివాసులు, గుండ్లూరు సుబ్రహ్మణ్యం, కాయల గిరిబాబు, టి. పెంచలయ్య, సివి నరసింహులు, వి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page