top of page

21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 13, 2022
  • 1 min read

21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్విరామంగా నిర్వహిస్తున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యెనలేని స్పందన కనిపిస్తోంది, కాగా ప్రొద్దుటూరు నందు గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అత్యధికంగా కార్యక్రమంలో పాల్గొని ముందంజలో నిలిచారన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు, ఎండనక వాననక వార్డులలోని ప్రతి గడపను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నేటి సాయంత్రం పొద్దుటూరు నియోజకవర్గ మునిసిపల్ పరిధిలోని 21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వార్డులోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ వార్డులో పర్యటించారు.

ఈ కార్యక్రమంలో 21వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి కొవ్వూరు స్వాతి చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి భీముని పల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, మహిళ నాయకురాలు గజ్జల కళావతి, గుమ్మల్ల పద్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్రమ్ గౌస్, హౌసింగ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ ద్వార్శల భాస్కర్ రెడ్డి, రాష్ట్ర డైరెక్టర్లు, సచివాలయ సిబ్బంది 21 వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page