top of page

కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

  • Writer: EDITOR
    EDITOR
  • May 17, 2023
  • 1 min read

కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

కంటి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
ree

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పట్టణంలో నూతనంగా నిర్మించబడిన అరవింద్ నేత్రాలయ ఆసుపత్రి వైద్యులతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బిపి, మధుమేహానికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఊటుకూరు పంచాయతీ కార్యదర్శి జే.బాల కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కుమార్ మాట్లాడుతూ సుమారు 60 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 13 మందికి శుక్లాల సమస్య ఉన్నట్లు తేలిందని తెలియజేశారు. అరవింద్ ఆసుపత్రి వారు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అరవింద్ నేత్రాలయ వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page