top of page

పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 22, 2023
  • 1 min read

పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె

ree

కలకత్తా, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, చిన్నప్పటి నుంచి తనను తాను పురుషుడిగా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించింది. దీని కోసం న్యాయ నిఫుణులు, వైద్య నిఫుణుల సలహాలు తీసుకుంటున్నట్లు మీడియాకు చెప్పింది. పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగ మార్పిడికి సిద్ధమైంది. ఇటీవల ఎల్‌జిబిటిక్యూ వర్క్‌షాప్‌నకు ఆమె హాజరైంది. దీంతో పుట్టుక నుంచే తాను పురుషుడినన్న ఆమె నమ్మకం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో లింగ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా శారీరకంగా కూడా అలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. సుచేతన నుంచి సుచేతన్‌గా మారేందుకు సంబంధిత న్యాయ, వైద్య సలహాలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ree

కాగా, జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల మారిదిగానే ఈ నిర్ణయాన్ని కూడా తాను సొంతంగా తీసుకున్నట్లు 41 ఏళ్ల సుచేతన తెలిపింది. ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగానే పురుషుడిగా మారుతున్నట్లు చెప్పింది. అలాగే ట్రాన్స్‌ మ్యాన్‌గా ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను లింగ మార్పిడి ద్వారా ఆపాలనుకుంటున్నట్లు పేర్కొంది. తాను మానసికంగా పురుషుడినని నమ్ముతున్నానని, ఇకపై శారీరకంగా కూడా అలాగే ఉండాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ree

మరోవైపు తల్లిదండ్రులు, లేదా కుటుంబం గుర్తింపు పెద్ద సమస్య కాదని సుచేతన చెప్పింది. అయితే తన తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగవద్దని మీడియాకు సూచించింది. చినప్పటి నుంచి తన గురించి తెలిసిన తండ్రి, తన నిర్ణయానికి మద్దతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై రాద్ధాంతం చేయవద్దని మీడియాను ఆమె కోరింది.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page