top of page

ఎమ్మెల్యే రాచమల్లు పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే వరద...

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 21, 2023
  • 1 min read

ఎమ్మెల్యే రాచమల్లు పై తీవ్ర విమర్శలు చేసిన

మాజీ ఎమ్మెల్యే వరద

ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గడిచిన నాలుగేళ్ల కాలంలో వేయి కోట్ల ఆస్తిని సంపాదించి బాగా అభివృద్ధి చెందాడని, ప్రొద్దుటూరు అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేసాడంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తాము చేసిన అభివృద్ధి పనులకు తుది మెరుగులు దిద్ది ఆ అభివృద్ధి పనులు తానే చేసినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని వరదరాజుల రెడ్డి విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం తప్ప అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాలికి వదిలేసాడంటూ ఆరోపించారు. మళ్లీ ఇదే ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రజలు తమ ఆస్తులను ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వరదరాజులు రెడ్డి అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page