top of page

విద్యుత్ చార్జీల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 20, 2023
  • 1 min read

విద్యుత్ చార్జీల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ

ree

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట


రాజంపేట డివిజన్ ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ( ఏ.పీ.ఈ.ఆర్.సి ) ఆధ్వర్యంలో రాజంపేట విద్యుత్ డి.ఈ కార్యాలయంలో ఆన్లైన్ విధానం ద్వారా విశాఖ పట్టణం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ రెండవరోజు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. డివిజన్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్లైన్లో ఒక వినియోగ దారుడు పాల్గొన్నారని.. తమ అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ( ఏపీ ఈ ఆర్ సి) తెలియజేశారని డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి విలేఖరులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం శనివారం కూడా కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమం లో డి.ఈ.ఈ లు యం.సురేంద్ర నాథ్, సి.బాలాజీ, బి.మురళీధర్ రెడ్డి, ఏ.ఈ లు ఏ.ఉమాపతి, పీ.రామకృష్ణ రాజు లు పాల్గొన్నారు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page