top of page

తూ.గో లో మత్స్యకార అభ్యున్నతి యాత్ర

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 13, 2022
  • 1 min read

తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ రూరల్ వలస పాకలు తదితర ప్రాంతాల్లో మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా జనసేనాని పిలుపుపై ఈరోజు రాష్ట్ర ప్రముఖ జనసేన ముఖ్య నేత, జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ రథసారథి కందుల దుర్గేష్, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ మత్స్యకార అభ్యున్నతి యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖ నేతలు, జిల్లా కార్యదర్శులు,జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు ప్రముఖ నాయకులు అంతా ఈ అభ్యున్నతి యాత్ర కార్యక్రమం చేపట్టి మత్స్యకారులకు, వారి కుటుంబాలకు, అండగా వారి కష్టసుఖాల్లో మేమున్నామంటూ, ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా మత్స్యకారులు, వారు పడుతున్న పలు సమస్యలను తెలుసుకుని వారికి అండగా జనసేన పార్టీ, జనసేన రాష్ట్ర అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఏప్పుడు ఉంటారని భరోసా నిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనసేనాని ఆశయాలతో, వారి ఆదేశాల అనుసారం ప్రజా సమస్యలపై, నిరంతరము జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలిపారు. ప్రజాసమస్యలు, ప్రధాన రహదారి సమస్యలపై, మరియు రైతు సమస్యలపై పోరాడమని, ఈరోజు మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా వారి కొరకు, ఎవరికి ఏ కష్టం వచ్చినా జనసేనాని అండగా ఉంటారని ఒక భరోసా ఇచ్చినారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత నాదెండ్లమనోహర్ తో పాటు, పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలు, జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, పలువురు మత్స్యకారులు, వారి కుటుంబాలకు చెందిన నాయకులు ఈ యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page