top of page

బస్సు బైక్ ఢీ... మద్యం మత్తులో వాహనదారుడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 31, 2021
  • 1 min read

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం, నాగులపల్లి నుండి కాకినాడ వలసపకల వి.ఎస్.ఎల్ కాలేజ్ కి విద్యార్థులతో వెళ్తున్నటువంటి బస్సును ఎండపల్లి జంక్షన్ మీదుగా వచ్చే బైక్ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ మరియు మండల ఎస్సై అబ్దుల్ నభి వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారుడను ఆటోలో హాస్పిటల్ కి తరలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page