top of page

4వ వార్డులో డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 13, 2024
  • 1 min read

4వ వార్డులో డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ

ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి 25 లక్షల వరకు పెంచి పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాలుగో వార్డ్ కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను 4వ వార్డులోని దాదాపు 100 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, పలువురు వైసిపి నాయకులు, హెల్త్ సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ree
ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Jan 13, 2024
Rated 5 out of 5 stars.

Good

Like
bottom of page