top of page

వివేకా హత్యకేసు దర్యాప్తుపై నేటితో ముగియనున్న గడువు

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 30, 2023
  • 1 min read

వివేకా హత్యకేసు దర్యాప్తుపై నేటితో

ముగియనున్న గడువు

ree

హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదు.


అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీం కోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా..? లేక సుప్రీం కోర్టును మరింత గడువు కోరతారా అనే సందిగ్ధత కొనసాగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఒకరిద్దరిపై ఇవాళ లేదా వారం, పది రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.

ree

జైళ్లో ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్ ముగిసినందున.. నేడు సీబీఐ కోర్టులో హాజరు పరచనున్నారు. పులివెందులలో 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు నాలుగేళ్లుగా అనేక మలుపులు తిరుగుతోంది.

ree

మొదట రాష్ట్ర పోలీసుల సిట్ దర్యాప్తు ప్రారంభించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 209 జూన్ 13న కొత్త సిట్ ఏర్పాటైంది. చివరకు హైకోర్టు ఆదేశాలతో 2020లో కేసు సీబీఐకి చేరింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. వివేకా హత్య కేసును ఏప్రిల్ 30నాటికే పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. తర్వాత ఆ గడువును నేటి వరకు పొడిగించింది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page