top of page

ఇన్చార్జిగా ముక్కా నియామకంపై టిడిపి శ్రేణుల సంబరాలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 8, 2024
  • 1 min read

నియోజకవర్గ ఇన్చార్జిగా ముక్కా నియామకంపై టిడిపి శ్రేణుల సంబరాలు.

---ఇది శుభ పరిణామం--కాకర్ల నాగార్జున.

ree

టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జి బాధ్యతలను ముక్కా చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముక్కా రూపానంద రెడ్డికి ప్రకటించడం శుభపరిణామం అని యువ నాయకులు కాకర్ల నాగార్జున అన్నారు.

శుక్రవారం టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలను వేసి బాణాసంచాలు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయాన్ని అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రూపానందా రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని, గెలుపు ఖాయమని అందరినీ కలుపుకొని మేమంతా కలిసికట్టుగా గెలుపుకు కృషి చేస్తామన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.నాలుగు మార్లు విఫలమైన టిడిపికి కోడూరులో పూర్వం వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో మండల సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బాలు రామాంజులు, మన్నూరు సత్యనారాయణ, పుల్లంపేట నారాయణ నాయుడు,కాకర్ల కోటేశ్వరరావు, మాచిన రవీంద్ర, మన్నూరు వెంకటేశ్వర్లు, కందుల శివశంకర్, రాటకొండ సుబ్బారాయుడు, బుంగటావువల ప్రభాకర్, తుంగా దినేష్, బిసి నాయకులు ధనంజయ, దేరంగుల వెంకటేష్ తదితరులు పాల్గున్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page