top of page

గెలుపోటములు సమానంగా స్వీకరించాలి. టోర్నమెంట్ ప్రారంభం లో కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 22, 2022
  • 1 min read

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ కొరముట్ల.


--గెలుపోటములు సమానంగా స్వీకరించాలి.

--ఆటను ను ఆటలాగే చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూడరాదు. కొరముట్ల.

ree

ree

ఈరోజు ఉదయం ఓబులవారిపల్లె మండలం ముక్కవారి పల్లి గ్రౌండు నందు జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంటు-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొనగా టోర్నమెంట్ నిర్వాహకులు కొరముట్ల ను ఘనంగా స్వాగతించారు. తదుపరి ఇరు జట్ల మధ్య టాస్ వేసి ఆటను ప్రారంభిస్తూ గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఆటను వ్యక్తిగతంగా కాక ఆటలాగే ఆడి ఆనందించాలని తెలిపారు. తాను కూడా కాసేపు క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహ పరిచారు.


ree

ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, కన్వీనర్ ముస్టాక్,ఉప సర్పంచ్ తోట శివ సాయి, ఆర్గనైజర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page