top of page

సిపిఎం పార్టీని  బలోపేతం  చేయండి - మోహన్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 7, 2022
  • 1 min read

సిపిఎం పార్టీని  బలోపేతం  చేయండి.

జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రెడ్డి పిలుపు!

ree

రైల్వేకోడూరు నియోజకవర్గంలో పార్టీని ప్రజాసంఘాల ని బలోపేతం చేయాలని  సిపిఎం పార్టీ,  జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు,ఏ.రామోహన్ రెడ్డ పిలుపునిచ్చారు.


అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యులు శిక్షణా తరగతులు సి హెచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన శనివారం, అనంతరాజుపేట అమరావతి ప్రైవేట్ కళాశాలలో జరిగాయి.

ree

ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ, నీతి నిజాయితీ కి, క్రమశిక్షణకు, సిపిఎం పార్టీ విలువలతో కూడి ఉందని, దేశంలో ఆదర్శంగా నిలిచిందని, పెట్టుబడిదారుల పార్టీలకు, ప్రత్యామ్నాయంగా, కార్మిక కర్షక వర్గ పార్టీ , మాత్రమే దేశంలో సమస్యలు పరిష్కరించగలరని; సోషలిస్టు లక్ష్యం కోసం పోరాడుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు, ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు, భవిష్యత్తులో పోరాడాలని స్థానిక సమస్యల పైన, పోరాడాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయిల లోని వివిధ తరగతుల సిపిఎం సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంది కాళ్ళ మణి తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page