top of page

భారత్ లో కొత్తగా 14,830 కరోనా కేసులు 36 మరణాలు నమోదు

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 26, 2022
  • 1 min read

భారత్ లో కొత్తగా 14,830 కరోనా కేసులు 36 మరణాలు నమోదు...

ree

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో14,830 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,39,05,621 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,47,512 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 36 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,26,110 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,159 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,32,46, 829 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,02,50,57,717 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 30,42, 476 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page