top of page

ఏపీ లోకి ప్రవేశించిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 18, 2022
  • 1 min read

ఏపీ లోకి ప్రవేశించిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర.

ree

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 21 వరకు నాలుగు రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. తిరిగి ఈనెల 22న కర్ణాటకలోని రాయచూర్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page