top of page

నాకు ప్రాణహాని ఉంది - చింతమనేని

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 26, 2022
  • 1 min read

ఏలూరు జిల్లా, ఏలూరు, నాకు ప్రాణహాని ఉందంటూ న్యాయస్థానంను ఆశ్రయించిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. నన్ను అంతం చెయ్యాలని చూస్తున్నారన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరులో జిల్లా న్యాయమూర్తిని ఆశ్రయించి, ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చిన చింతమనేని.


చింతమనేని ప్రభాకర్ కామెంట్స్ :

వైసీపీ అధికారం చేపట్టాక ప్రతిపక్ష పార్టీ నేతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది.


అధికార పార్టీ వేధింపులపై రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర హోంశాఖ అధికారులకు కూడా ఫైర్యాదు చేస్తాం.


నాకు జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ పై, సజ్జల పై, మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ పై ప్రయివేట్ కంప్లెయింట్ ఇచ్చాను.


బాబుదే బాదుడు కార్యక్రమం ద్వారా వైసీపీ ఆగడాలు ప్రజలకు వివరిస్తుంటే మా పై అక్రమ కేసులు పెడుతున్నారు.


ఏలూరులో జిల్లా కోర్టు వద్ద మీడియాతో చింతమనేని ప్రభాకర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page