top of page

పేదలకు భోజన పొట్లాలు పంపిణీ

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 13, 2023
  • 1 min read

పేదలకు భోజన పొట్లాలు పంపిణీ

భోజనం పొట్లాలను అందజేస్తున్న శరత్ బాబు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


టిడిపి కువైట్ ఎన్నారై యువ నాయకులు అద్దేపల్లి రామ్మోహన్ రాజు, స్వాతి దంపతుల కుమార్తె వర్షిక పుట్టినరోజును పురస్కరించుకొని రామ్మోహన్ రాజు సోదరుడు రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ప్రతాప్ రాజు, వాసవి సహృదయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం బోయిన పల్లె అరుంధతి వాడలో పేదలకు భోజనం పొట్లాలు పంపిణీ చేశారు.

ree

ఈ సందర్భంగా వాసవి సహృదయ సేవా ట్రస్ట్ అధ్యక్షులు శరత్ బాబు మాట్లాడుతూ టిడిపి కువైట్ ఎన్నారై నాయకులు రామ్మోహన్ రాజు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని అన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని., ఇది తెలిసిన రామ్మోహన్ రాజు తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page