top of page

చక్రపాణి రెడ్డి మరణం పార్టీకి తీరని లోటు. ఎంపీ, ఎమ్మెల్యే.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Dec 25, 2022
  • 1 min read

చక్రపాణి రెడ్డి మరణం వైసీపీ పార్టీకి తీరని లోటు.

ఎంపీ మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే కొరముట్ల.

ree

వైయస్సార్ కుటుంబానికి ఆత్మీయులు, చిట్వేలు మండల వైసిపి పార్టీ సీనియర్ నాయకులు ముద్దా చక్రపాణి రెడ్డి ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందారు.

విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు చక్రపాణి రెడ్డి భౌతిక కాయన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియపరిచారు. తమతో తమ పార్టీతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుని, చక్రపాణి రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని వారన్నారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు, టిడిపి బాధ్యులు కస్తూరి విశ్వనాధ నాయుడు తదితరులు భౌతిక కాయని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎల్వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, మల్లిశెట్టి వెంకటరమణ, ప్రదీప్ రెడ్డి, తొంబరపు సుబ్బరాయుడు, ముద్దా బాబుల్ రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి మరియు నియోజకవర్గ,మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. సోమవారం ఉదయం అంతిమక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియపరచారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page