top of page

చైన్ స్నాచర్ల అరెస్ట్ వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 1, 2022
  • 1 min read

వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు


గత నెల తొమ్మిదవ తారీఖున ఎర్రగుంట్ల బైపాస్ సర్కిల్ వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ కేసును రెండవ పట్టణ పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిలకు గుర్తించిన పోలీసులు, మొదటి ముద్దాయుని గత నెల 13వ తేదీన అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా, రెండవ ముద్దాయి అయిన నక్కొనిపల్లే గ్రామం, మైలవరం మండలానికి చెందిన గువ్వల పుల్లా రెడ్డిని నేడు అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు.

కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయి పుల్లారెడ్డి నీ విచారణ చేయగా, పలు దొంగతానాల్లో కేసులు నమోదు అయినట్లు, ప్రవర్తనలో మార్పు రాకపోతే పిడి ఆక్ట్ ప్రయోగించనున్నట్లు డి.ఎస్.పి ప్రసాద్ రావు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page