top of page

చంద్రబాబు బెయిల్ పై చిట్వేలి టిడిపి,జనసేన సంబరాలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 31, 2023
  • 1 min read

చంద్రబాబు మధ్యంతర బెయిలు పై చిట్వేలి టిడిపి,జనసెన నాయకుల సంబరాలు.

---టపాసులు పేల్చి - జై చంద్రబాబు అంటూ నినాదాలు.

--టిడిపి జనసేనదే అంతిమ విజయం అని ధీమా.


ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకుంటున్న టిడిపి,జనసేనలు


ree

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు హైకోర్టు మంగళవారం మద్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చిట్వేలు టిడిపి శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. ఆర్టీసీ బస్టాండు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి నిజం గెలిచింది, న్యాయం గెలిచింది, అన్యాయం ఓడింది అంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.


యువ నాయకులు కాకర్ల నాగార్జున మాట్లాడుతూ..




కక్షపూరిత అరెస్టులతో మా నాయకుడిని బంధించారని ఇప్పటికి నిజాలను నిరూపించలేక ఊరుకున్నారన్నారు.అంతిమంగా రాబోవు తీర్పు లో టిడిపి దే విజయమని వారు ధీమా వ్యక్తం చేశారు. జై చంద్రబాబు జై తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలు చేసి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.


పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు


ree

ఈ కార్యక్రమం లో టిడిపి సీనియర్ నాయకులు లారీ సుబ్బారాయుడు, బాలు రామాంజులు నాయుడు, మన్నూరు సత్యనారాయణ,యువ నాయుకులు కాకర్ల నాగార్జున, జనసేన నాయకులు మాదాసు నరసింహ,శివ, కంచర్ల సుధీర్ రెడ్డి, టిడిపి నాయకులు దుగ్గిన వెంకటయ్య, కాకర్ల కోటేశ్వరరావు, వెంకటేష్, ధనంజయ, తమ్మిశెట్టి శ్రీను, తుంగా పిచ్చయ్య, పెరుగు వెంకటసుబ్బయ్య, మాచిన రవీంద్ర, సబ్బీర్ అలీ, అద్భుత్ కుమార్, మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page