top of page

దొంగలించిన వాహనాన్ని రికవరీ చేసిన నందలూరు పోలీసులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 13, 2023
  • 1 min read

దొంగలించిన వాహనాన్ని రికవరీ చేసిన నందలూరు పోలీసులు

ree
స్కూటీ నీ యజమానికి అప్పగిస్తున్న ఎస్ఐ

నందలూరు మండలం లోని నాగిరెడ్డి పల్లి మేజర్ పంచాయతీ పరిధి నందు నాగిరెడ్డి పల్లి హరిజన వాడకు చెందిన మణి అనే వ్యక్తి తన ఇంటి బయట నిలబెట్టి ఉన్న ఏపీ39 ఆర్ ఎం 2386 నెంబర్ గల స్కూటీ నీఈ నెల 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి దొంగలించుకొని పోవడం జరిగిందని వచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అది ప్రకాశం జిల్లా, ఉల్లవపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నది అని వచ్చిన సమాచారం మేరకు అక్కడకు వెళ్లి స్కూటీ నీ రికరీ చేసి బండి యజమానికి అప్పగించడం జరిగిందని ఎస్ ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు.


5గురు పేకాట రాయులు అరెస్ట్


నందలూరు మండలం పరిధి లో అరుంధతి వాడ గ్రామ సమీపంలో గల గంజే షహీద్ అరబ్ షావల్లి దర్గా వద్ద మంగళ వారం రాత్రి 10గంటల సమయంలో ఐదుగురు జూదర్లు లను అరెస్టు చేసి వారి నుండి రూపాయలు 2050/-, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని ఐదుగురు జుదర్లు పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page