top of page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి - రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధ

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 6, 2023
  • 1 min read

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి - రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్

ree

సోమవారం రాజంపేట బిజెపి అసెంబ్లీ ముఖ్య నాయకుల సమావేశం రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు అధ్యక్షతన వారి స్వగృహంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ విచ్చేసి మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, అలాగే రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్థానిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ఉద్యమం నిర్వహించాలని వారు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ree

ఈ కార్యక్రమంలో బిజెపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ ఏ.వి సుబ్బారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎన్.రమేష్ నాయుడు, పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీ సభ్యులు సాయి లోకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సురేష్ రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బి.సుభద్ర, పట్టణ అధ్యక్షులు ఎం.వెంకటసుబ్బయ్య నాయుడు, సిద్ధవటం మండల అధ్యక్షులు అమర్నాథ్ శర్మ, ఒంటిమిట్ట మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్, సుండుపల్లి మండల అధ్యక్షులు రామ జగదీశ్ స్వామి, వీరబల్లి మండల అధ్యక్షులు నరేంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.కే నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షులు తోట నగేష్, బిజెపి నాయకులు టీ.హరి ప్రసాద్, గాదెల శ్రీనివాసులు, పి.పాపయ్య, రాజు, బిజెపి నాయకులు పి.కొండయ్య, రామయ్య, విఠలాచారి, డాక్టర్ వేణు ప్రసాద్ రాజు, సునీత వర్మ, అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page