top of page

రైళ్ల నిలుపుదల కై కేంద్ర రైల్వేమంత్రిని కలిసిన సాయి లోకేష్.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 24, 2022
  • 1 min read

నందలూరు, ఓబులవారిపల్లె వద్ద రైల్ల నిలుపుదలను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర మంత్రిని కలిసిన సాయి లోకేష్.


ree

అందరికీ అవసరం ఉపయోగకరమైన మన ప్రాంత అభివృద్ధి కోసం మనమంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందలూరు మరియు ఓబులవారిపల్లె వద్ద రైల్ల నిలుపుదల ను పునరుద్దించాలని కోరుతూ ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని విష్ణవ్ బిజెపి రాజకీయ విభాగం ప్రతినిధి సాయి లోకేష్ కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగినది. కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సాయి లోకేష్ తెలియజేశారు.



ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టకు సమీపంలో ఉన్న నందలూరు నందు, వివిధ ఉద్యానవన పంటల రైతులకు ప్రయోజకరంగా ఓబులవారిపల్లి నందు రాయలసీమ, వెంకటాద్రి, తిరుమల, హరిప్రియ, దాదర్, సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లకు స్టాపింగ్ ఇవ్వమని కోరడం జరిగింది.


వారు నివేదికని స్వీకరించిన వెంటనే సంబంధింత అధికారులతో చర్చించి సానుకూలంగా స్పందించినందుకు వారికి సాయి లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page