top of page

నూతన ఆలయానికి భూమి పూజ

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 18, 2023
  • 1 min read

నూతన ఆలయానికి భూమి పూజ

భూమి పూజ చేస్తున్న పండితులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండల కేంద్రంలోని పెద్ద కారంపల్లి పంచాయతీ అరుంధతి వాడలో శనివారం నూతనంగా నిర్మిస్తున్న ఆలయానికి భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, వీరబల్లి ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవస్థానమునకు వేద పండితుల చేత పూజా కార్యక్రమంతో భూమి పూజ చేశారు.

ree

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద కారంపల్లి గ్రామ వాస్తవ్యులు మన్నూరు రామలక్ష్మమ్మ, నారాయణరెడ్డి కుమారుడు ప్రవాసాంధ్రులు కె. కె రెడ్డి సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం హర్షణీ య మన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మన్నూరు రామలక్ష్మమ్మ, వెంకటసుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు చొప్ప ఎల్లారెడ్డి, దాసరి పెంచలయ్య, ఎంజీపురం ఎంపీటీసీ మధుబాబు, మిరియాల సురేఖ, బాబు, సుబో ద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page