top of page

వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలి

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 26, 2023
  • 1 min read

వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలి

పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని వి ఆర్ విత్ యు చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు వెల్లాల నితిన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మండలంలోని జి. వడ్డిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు "ఉయ్ ఆర్ విత్ యు" చారిటబుల్ ట్రస్ట్ వారు ఆదివారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.

ree

ఈ సంధర్భంగా ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు వెల్లాల నితిన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉయ్ ఆర్ విత్ యు ట్రస్ట్ ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నదని., అందులో భాగంగానే వడ్డిపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ప్రస్థుత రోజుల్లో ప్రతిఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ వైద్యులు శివలీల, అశ్వని(సి.హెచ్.ఓ) లు ప్రజల కు బి.పి, షుగర్, హెచ్.బి మరియు సీజనల్ వ్యాదులకు సంబంధించి 58మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ప్రియాంక, లోకేశ్వర్ రెడ్డి, రేష్మాబాణు, ముక్తియార్, వేణుకుమార్, చరణ్, నాగార్జున, మంజు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page