top of page

56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 15, 2023
  • 1 min read

56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

తనిఖీలు నిర్వహించిన ఉప సంచాలకులు.

ree
విద్యార్థులతో మాట్లాడుతున్న ఉప సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి

నందలూరు శాఖ గ్రంధాలయం నందు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి రవిశంకర్ రాజు తెలిపారు. గ్రంథాలయ వారోత్సవ నిర్వహణ తనిఖీ అధికారి ఉపసంచాలకులు శ్రీనివాసులు రెడ్డి మరియు కార్యదర్శి అమీరుద్దీన్ తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనను తిలకించడం జరిగినది. విద్యార్థినీ విద్యార్థులు వేసిన డ్రాయింగ్ పోటీలను చూసి విద్యార్థులను ప్రశ్నలు వేసి సమాధానము రాబట్టిన ఉపసంచాలకులు శ్రీనివాసులు రెడ్డి, అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంధాలయం అనేది విజ్ఞాన కేంద్రం అని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి అనంతకృష్ణ మరియు ఉపాధ్యాయులు కృపానందం, వెంకటసుబ్బయ్య, మరియు గ్రంథాలయాధికారి పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page