top of page

2023 జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 16, 2022
  • 1 min read

2023 జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌

ree

జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ను జాతీయ పరీక్షల మండలి గురువారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఏ జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా, రెండో సెషన్‌ ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్‌ పరీక్షను 13 భాషల్లో (ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళ్‌, ఉర్దూ) నిర్వహించనున్నారు.

ree

తొలి సెషన్‌ పరీక్షకు నేటి (డిసెంబర్‌ 15) నుంచి జనవరి 12 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 12 రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు విధించారు. ఏ సిటీలో పరీక్ష నిర్వహిస్తామనేది జనవరి రెండో వారంలో ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను జనవరి మూడో వారంలో ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page