top of page

పది ఫలితాల్లో బాలికలదే పైచేయి. మొదటి స్థానం లో

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 6, 2022
  • 1 min read

ఫలితాలలో బాలికలదే పైచేయి. మొదటి స్థానం లో కనిష్క.


ree

2021 - 22 విద్య సంవత్సరానికి గాను ఈరోజు వెలువడిన పది ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా బాలికలే పైచేయి లో నిలవగా అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలో కూడా బాలికల ముందంజలో నిలిచారు.


మొదటి స్థానంలో నాగవరం విద్యా నికేతన్ స్కూల్ విద్యార్థిని వి. కనిష్క 576 మార్కులతో మొదటి స్థానం, సాయి వికాస్ కు చెందిన ఎం. రిషిత 568 మార్కులతో రెండో స్థానం, అక్షర హై స్కూల్ కు చెందిన జి. దీపాక్షిత 565 మార్కులతో మూడవ స్థానం, శ్రీ పద్మావతి హై స్కూల్ కు చెందిన పి పూజిత శ్రీ 561 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచారు.

మండల వ్యాప్తంగా 574 మంది హాజరు కాగా 312 మంది ఉత్తీర్ణులు 262 మంది వెనుకబడి నట్లు తెలుస్తుంది.


ఉత్తమ ఫలితాలు కనపరిచిన పై విద్యార్థులకు ఆయా స్కూలు యాజమాన్యం అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page