top of page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

  • Writer: EDITOR
    EDITOR
  • Oct 28, 2023
  • 1 min read

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ree
మృతి చెందిన వ్యక్తి ఫోటో

నందలూరు మండల పరిధిలో గల బస్టాండ్ కూడలి నందు అరవపల్లి గాంధీనగర్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రాజాక్ కుమారుడు సయ్యద్ ఇలాకత్ (57) వయసు కలిగిన వ్యక్తి శనివారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న సమయంలో కడప నుండి రాజంపేటకు వెళ్తున్న AP 04 TX 7252 వాహనము అత్యంత వేగంగా వచ్చి అతనిని ఢీకొనడంతో ఇలాకత్ తలకు భారీగా గాయమై అక్కడికక్కడే మృతి చెందిన జరిగిందని స్థానిక ఎస్ ఐ అబ్దుల్ జహీర్ తెలిపారు. వాహనాన్ని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మృత దేహాన్ని పంచనామా నిమిత్తమై రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆయన అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని ఆయన అన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page