top of page

ప్రపంచానికి అహింస ప్రాధాన్యతను తెలిసేలా చేసిన మహనీయుడు మహాత్మా గాంధి - రాచమల్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 2, 2023
  • 1 min read
ree

కడప జిల్లా, ప్రొద్దుటూరు


నేడు జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి పురస్కరించుకొని ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయం లోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ భిమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ నాయకులు పూలమాలలు వేశారు, అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన మహనీయుడు గాంధీజీ అని, స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన మహనీయుడు ధీశాలి మహాత్మా గాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైస్ చైర్మన్ ఖాజా, వైసీపీ సీనియర్ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page